కశ్మీర్‌: కుల్గావ్‌లో మరో ఇద్దరు స్థానికేతరులను కాల్చి చంపిన మిలిటెంట్లు

కశ్మీర్‌లో కాల్పులు

ఫొటో సోర్స్, ANI

జమ్ముకశ్మీర్‌లోని కుల్గావ్ జిల్లాలోని వాన్‌పో ప్రాంతంలో ఉగ్రవాదులు స్థానికేతర కార్మికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఆదివారం జరిగిన ఈ కాల్పులలో ఇద్దరు వలస కూలీలు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారని కశ్మీర్ పోలీసులు తెలిపారు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని మిలిటెంట్ల కోసం వెతుకుతున్నాయి.

మిలిటెంట్ల కాల్పులలో మరణించిన కార్మికులు ఇద్దరూ బిహార్‌కు చెందినవారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

శనివారం కూడా మిలిటెంట్లు శ్రీనగర్, పుల్వామాలలో ఇద్దరు స్థానికేతరులను కాల్చి చంపేశారు.

శ్రీనగర్‌లో మరణించిన వ్యక్తి బిహార్‌కు చెందిన అరవింద్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు.

పుల్వామాలో మరణించిన సాగిర్ అహ్మద్‌ది ఉత్తరప్రదేశ్. కార్పెంటర్ పనిచేసుకుంటూ జీవిస్తున్న ఆయన మిలిటెంట్ల తుపాకులకు బలయ్యారు.

మరోవైపు వరుస దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్లను ఏరివేసేందుకు కశ్మీర్ పోలీసులు, భద్రతాదళాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నాయి.

గత వారం రోజులలో మొత్తం 13 మంది మిలిటెంట్లను హతమార్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)