కరోనావైరస్ నిజాముద్దీన్: తబ్లిగీ జమాత్ అధ్యక్షుడు ముహమ్మద్ సాద్పై హత్య కేసు నమోదు

ఫొటో సోర్స్, Hindustan Times
దిల్లీలోని తబ్లిగీ జమాత్ సంస్థ అధ్యక్షుడు ముహమ్మద్ సాద్ ఖాందాల్వీ మీద మానవ హత్యకు కారణమయ్యారనే అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాముద్దీన్ ప్రాంతంలోని మసీదులో తబ్లిగీ జమాత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక సామూహిక కార్యక్రమం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కోవిడ్-19 క్లస్టర్ల ఏర్పాటుకు దారితీసింది.
దేశ రాజధాని దిల్లీలో నిర్వహిస్తున్న ఆ కార్యక్రమాన్ని ముగించాల్సిందిగా రెండుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, ముహమ్మద్ సాద్ వాటిని పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు. దేశంలోని 17 రాష్ట్రాలలో నమోదైన 1023 కరోనావైరస్ పాజిటివ్ కేసులకు నిజాముద్దీన్ కార్యక్రమంతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చిన విదేశీయుల ద్వారా వైరస్ మిగతా వారికి సోకిందని భావిస్తున్నారు.
అయితే, ముహమ్మద్ సాద్, ఆయన ఆధ్వర్యంలోని తబ్లీగీ జమాత్ ఆ ఆరోపణలను తొసిపుచ్చారు.
శిక్షార్హమైన హత్యా నేరానికి పాల్పడ్డారనే అభియోగాలతో ఆయన పై కేసు నమోదు చేశామని దిల్లీ పోలీసులు తెలిపారు. అంటే, సాద్కు ఈ కేసులో బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకునేందుకు వీలుండదు.
ఆయన స్వీయ నిర్బంధం (ఐసోలేషన్)లో ఉన్న సమయంలో ఆయనపై ఈ అభియోగాలు నమోదయ్యాయి.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?

దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీగీ జమాత్ సామూహిక కార్యక్రమం మార్చి 3న మొదలైందని, భారతదేశంలో మార్చి 24న లాక్డౌన్ విధించిన తరువాత కూడా కొనసాగిందని పోలీసులు అంటున్నారు.
అయితే, మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన వెంటనే, ముహమ్మద్ సాద్ ఆ కార్యక్రమాన్ని సస్పెండ్ చేశారని, అందరూ ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని చెప్పారని తబ్లిగీ జమాత్ సంస్థ అంటోంది.
చాలా మంది వెళ్లిపోయారని, ఆ తర్వాత రోజు నుంచి రాష్ట్రాల సరిహద్దులు మూసివేయడంతో మిగతావారు అక్కడే ఉండిపోయారని, ఆ తర్వాత రెండు రోజులకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి, బస్సులు, రైళ్లను రద్దు చేయడంతో వారు వెళ్ళలేకపోయారని ఆ సంస్థ చెబుతోంది.
ఆ మసీదు ప్రాంగణంలో వందల మంది ఉండేందుకు వసతి గదులు ఉన్నాయి.
అన్ని విషయాలనూ పోలీసులకు తెలియజేశామని, మసీదు పరిసరాలను పరిశీలించేందుకు వచ్చిన వైద్య అధికారులకు సహకరించామని నిర్వాహకులు చెబుతున్నారు.

కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: లాక్డౌన్ పొడిగిస్తే ఎదురయ్యే పరిస్థితులకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా?
- కరోనావైరస్: తొలి కేసు నమోదవడంతో యెమెన్లో 'భయం భయం'
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? నిర్థరణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
- కరోనావైరస్: ఇటలీని దాటేసిన అమెరికా, ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇక్కడే
- కరోనా లాక్డౌన్: విపరీతంగా బయటపడుతున్న ఎలుకలు.. వీటిని నివారించడం ఎలా
- వుహాన్లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
- కరోనావైరస్: నియంత్రణ రేఖ 'సామాజిక దూరం' ఎలా పాటించాలంటున్న స్థానికులు
- మామకు కరోనా పాజిటివ్... రహస్యంగా చూసివచ్చిన అల్లుడిపై కేసు
- కొడుకు శవంతో రోడ్డుపై పరుగులు తీసిన తల్లి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








