శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే.. మాకొద్దంటూ అధ్యక్ష భవనం ఎదుట ప్రజల ఆందోళన

వీడియో క్యాప్షన్, ఆయన మాకొద్దంటూ అధ్యక్ష భవనం ఎదుట ప్రజల ఆందోళన

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘేను ఆ దేశ పార్లమెంటు సభ్యులు ఎన్నుకున్నారు. కానీ ప్రజలు మాత్రం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా కొన్ని నెలలుగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.

ప్రజాగ్రహం కట్టలు తెంచుకోవడంతో మునుపటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స గద్దెదిగి, దేశం వదిలి సింగపూర్ పారిపోవాల్సి వచ్చింది.

దాంతో నూతన అధ్యక్షుడి ఎన్నిక తప్పనిసరైంది.

పార్లమెంటు భవనంలో జరిగిన ఈ ఎన్నిక ఫలితాలను ఆ దేశ పార్లమెంటు జనరల్ సెక్రటరీ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)