అమెరికా ఆరోపణ: ‘కోవిడ్-19పై పరిశోధనలను చైనా హ్యాక్ చేస్తోంది’

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్-19పై తమ దేశంలో జరుగుతున్న పరిశోధనలను చైనాతో సంబంధాలున్న హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని అమెరికా అధికారులు చెబుతున్నారు.
వ్యాక్సిన్లు, చికిత్స, పరీక్షల విషయంలో తమ దేశ సంస్థలు, బృందాలు చేస్తున్న పరిశోధనలను హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ తెలిపింది.
చైనా ప్రభుత్వం సైబర్ గూఢచర్యానికి పాల్పడుతోందని చాలా రోజుల నుంచి అమెరికా ఆరోపణలు చేస్తోంది. అయితే, చైనా ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది.
కరోనావైరస్ సంక్షోభంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో మీరు విఫలమయ్యారంటే, మీరు విఫలమయ్యారంటూ అమెరికా, చైనా పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 43 లక్షలకుపైగా మంది కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ ఇన్ఫెక్షన్తో అమెరికాలో 83 వేల మంది బలవ్వగా, చైనాలో 4,600 మంది చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎఫ్బీఐ, అమెరికా హోంల్యాండ్ భద్రత విభాగానికి చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీ (సీఐఎస్ఏ) బుధవారం అరుదైన ఓ సంయుక్త హెచ్చరిక జారీ చేశాయి.
‘కోవిడ్-19కు సంబంధించి వైద్యం, ఫార్మాసూటికల్, పరిశోధన రంగాల్లో పనిచేస్తున్నవాళ్లు హ్యాకర్లకు ప్రధాన లక్ష్యం’ అనే విషయాన్ని గుర్తించాలని కోరాయి. ప్రజా ప్రయోజనం దృష్ట్యా జారీ చేసిన ప్రకటనగా దీన్ని పేర్కొన్నాయి.
కరోనావైరస్ను ఎదుర్కొనే విషయంలో విలువైన మేధో సంపత్తిని, ప్రజారోగ్య సమాచారాన్ని అక్రమంగా సంపాదించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించామని వివరించాయి.
సైబర్ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లుగా తమపై వస్తున్న ఆరోపణలను చైనా పదేపదే తోసిపుచ్చుతోంది.
కోవిడ్-19 చికిత్స, వ్యాక్సిన్ కోసం పరిశోధనల విషయంలో చైనా చాలా ముందుందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ఇటీవల వ్యాఖ్యానించారు. వదంతులు, నిరాధార ఆరోపణలతో తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం అనైతికమని అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS

అమెరికా ఆరోపణల్ని ఎలా అర్థం చేసుకోవాలి?
బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్ గార్డన్ కొరెరా విశ్లేషణ
పరిశోధనల విషయంలో ఇతర దేశాల నుంచి ముప్పు ఉందని అమెరికా, బ్రిటన్ మే 5న ఇదివరకే సంయుక్తంగా హెచ్చరికను జారీ చేశాయి.
అయితే, అందులో ఏ దేశం పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. కానీ, అది చైనా, రష్యా, ఇరాన్ల గురించి ఉద్దేశించిన ప్రకటన అని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి.
ఇప్పుడు దానికి కొనసాగింపు చర్యగానే, అమెరికా తన కొత్త హెచ్చరికలో ప్రత్యేకంగా ఒక్క చైనా పేరునే ఎత్తిచూపింది.
కొత్తగా ఏదైనా జరిగిందా అనే వివరాలు మాత్రం ఈ ప్రకటనలో లేవు.
దీనిని బట్టి, అమెరికా-చైనాల మధ్య పెరిగిన ఆందోళనల నేపథ్యంలో దేశీయంగా ప్రజల ఆమోదం కోసమూ, చైనాపై ఒత్తిడి పెంచేందుకూ అమెరికా కదిపిన పావుగానూ ఈ చర్యను కొందరు చూస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
చైనా సైబర్ కార్యకలాపాల అంశం గురించి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోమవారం మాట్లాడారు.
‘‘చైనా విషయంలో కొత్తగా ఏముంది? నేను ఆ దేశం తీరు పట్ల సంతోషంగా లేను. (కరోనావైరస్ను) పుట్టినచోటే ఆపగలిగేది. ఆపేయాల్సింది కూడా. ఇప్పుడు వాళ్లు హ్యాకింగ్ చేస్తున్నారని కూడా చెబుతున్నారు. ఇంకా కొత్తగా ఏముంది? మేం నిశితంగా పరిశీలిస్తున్నాం’’ అని ట్రంప్ అన్నారు.
చైనా హ్యాకింగ్కు పాల్పడుతోందని, మేధో సంపత్తిని దోచుకుంటోందని అమెరికా అధికారులు చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తున్నారు.
2009లో లాక్హీడ్ మార్టిన్ ఎఫ్-35 యుద్ధ విమానాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చైనాతో సంబంధమున్న హ్యాకర్లు దొంగిలించారని అమెరికా ఆరోపించింది. ఆ తర్వాత కొంతకాలానికే తాము అదే తరహా యుద్ధ విమానాన్ని (షెన్యాంగ్ జే-31) అభివృద్ధి చేస్తున్నట్లు చైనా ప్రకటించింది.
నాన్ ట్రెడిషనల్ కలెక్టర్స్ (ప్రలోభాలకో, బెదిరింపులకో లొంగిపోయి సమాచారం ఇచ్చేవారు)ను ఉపయోగించుకుని అమెరికా సంస్థల సాంకేతికతను చైనా దొంగతనం చేస్తోందని అమెరికా నిఘా అధికారులు గతంలో ఆరోపణలు చేశారు.
ఏటా రూ.30 లక్షల కోట్లకుపైగా విలువ చేసే మేధో సంపత్తిని చైనా దోచుకుంటోందని అమెరికా నేషనల్ కౌంటర్ ఇంటెలిజన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ డైరెక్టర్ బిల్ ఎవనినా అన్నారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- 1857 సిపాయిల తిరుగుబాటు: దిల్లీ నగరం ‘మృత్యు తాండవం’ చూసిన రోజు
- రెండో ప్రపంచ యుద్ధంలో ఎవరికీ పెద్దగా తెలియని 8 మంది మహిళా 'వార్ హీరోలు'
- హిట్లర్ మరణించాడని ప్రపంచానికి బీబీసీ ఎలా చెప్పింది?
- ఇండియా లాక్డౌన్-4 ఎలా ఉండబోతోంది? బస్సులు నడుస్తాయా? షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు తెరుచుకుంటాయా?
- ‘భారత్లో హిందువులకు, ముస్లింలకు... పాకిస్తాన్లో ముస్లింలకు, వాళ్లకు’ : బ్లాగ్
- రష్యా ఖచటుర్యాన్ సిస్టర్స్- తండ్రిని చంపిన కూతుళ్లు.. ‘ఆత్మరక్షణ కోసం’ చేసిన హత్య కాదా?
- WHO హెచ్చరిక: ‘కరోనావైరస్ ఎప్పటికీ పోకపోవచ్చు’
- అమెరికాలో కరోనావైరస్ వల్ల కనీసం 1,00,000 మంది చనిపోతారు: డోనల్డ్ ట్రంప్
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా?
- కరోనావైరస్ లాక్డౌన్: దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతాయా? సీఎంఐఈ నివేదిక ఏం చెప్తోంది?
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
- ఏడు దశాబ్దాల కిందట సముద్రంలో అణుబాంబు పేలుడు.. ఇంకా మానని గాయం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








