చూపు కోల్పోయిన టీచర్ హిమానీ కేబీసీలో కోటి గెలిచారు.. ఆమె కథ ఇదీ

వీడియో క్యాప్షన్, చూపు కోల్పోయిన టీచర్ హిమానీ కేబీసీలో కోటి గెలిచారు.. ఆమె కథ ఇదీ

దేశవ్యాప్తంగా తనకు గుర్తింపు వస్తుందని ఆగ్రాకు చెందిన హిమానీ బుందేలా కలలో కూడా అనుకోలేదు. ఆమె మేధస్సుపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ప్రశంసలు కురిపించారు.

25ఏళ్ల వయసులోనే ''కౌన్ బనేగా కరోడ్‌పతి'' సీజన్ 13లో ఆమె తొలి కరోడ్‌పతిగా నిలిచారు. ఆమె విజయం ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే కంటి చూపు సరిగా లేకపోయినా షోలో ఆమె కోటి రూపాయలు గెలుచుకోగలిగారు.

హిమానీకి 15ఏళ్ల వయసున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో ఆమె కంటిచూపు మసకబారింది. మళ్లీ ఆమెకు మునుపటిలా కంటి చూపు రావడానికి వైద్యులు నాలుగు శస్త్రచికిత్సలు చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

అయితే, హిమానీ ధైర్యం కోల్పోలేదు. జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. తమ కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగం పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు.

ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయాలో హిమానీ టీచర్‌గా పనిచేస్తున్నారు. బాల్యం నుంచి కరోడ్‌పతిగా మారడం వరకు తన జీవిత విశేషాలు ఆమె మాటల్లోనే చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)