కశ్మీర్లో ఏం జరుగుతోంది... శ్రీనగర్ నుంచి తెలుగు విద్యార్థులు ఎందుకు వెనక్కి వస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
భారత్ అధీనంలోని కశ్మీర్లో రెండు రోజులుగా హడావిడి బాగా పెరిగింది. ఆ ప్రాంతంలో భద్రత బలగాల మోహరింపులను కేంద్రం ఉన్నపళంగా పెంచింది.
పర్యాటకులు, అమర్నాథ్ యాత్రికులు ఆ ప్రాంతం వదిలివెళ్లిపోవాలని ప్రభుత్వం సూచనలు కూడా చేసింది.
ఈ పరిణామాలతో అనేక వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆర్టికల్ 35-ఏ, కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో మోదీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది.

ఫొటో సోర్స్, Lokesh
శ్రీనగర్ నిట్లో చదువుతున్న 130 మంది తెలుగు విద్యార్ధులను సురక్షితంగా తెలంగాణకు చేర్చేలా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జోషి దిల్లీలోని తెలంగాణభవన్ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆదేశాలమేరకు తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ జమ్మూ నుంచి దిల్లీకి తీసుకురావడానికి బస్సులను ఏర్పాటు చేశారని, అక్కడి నుంచి హైదరాబాద్కు రైలులో పంపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలంగాణ సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది.
నిట్ విద్యార్ధులతో తెలంగాణ భవన్ అధికారులు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారని, ఇప్పటికే వారు శ్రీనగర్ నుంచి జమ్మూకు రోడ్డు మార్గాన బయల్దేరారని పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
విద్యార్థులకు కేటీఆర్ భరోసా
ఎన్ఐటీ శ్రీనగర్ క్యాంపస్ను ఖాళీ చేయించాలని కేంద్రం సూచించిందని, అయితే, తెలుగు విద్యార్థులు ఆందోళనపడాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు (కేటీఆర్) ట్వీట్ చేశారు.
విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ విషయంలో సహాయం అవసరమైనవారు దిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరిని (ఫోన్ నెంబర్లు 011-2338 2041, 91 99682 99337) సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ANI
‘చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా’
కశ్మీర్లోని తాజా పరిణామాల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నాయకురాలు మహబూబా ముఫ్తీ శుక్రవారం రాత్రి తన ఇంట్లో వివిధ పార్టీల నాయకులతో ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ లోన్, పీపుల్స్ మూమెంట్ నాయకుడు ఫైసల్ కూడా సమావేశానికి హాజరయ్యారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో స్థానికులు బెంబేలెత్తుతున్నారని ఈ సమావేశం అనంతరం ముఫ్తీ మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. మునుపెన్నడూ తాను ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆమె వ్యాఖ్యానించారు.
కశ్మీర్లో పరిస్థితి మెరుగైందని చెప్పుకుంటున్న కేంద్రానికి ఇక్కడ భద్రత బలగాల మోహరింపులను పెంచే అవసరం ఎందుకు వచ్చిందని ముఫ్తీ ప్రశ్నించారు.
''ఆర్టికల్ 35ఏ, జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో మార్పులు చేస్తారని వదంతులు వస్తున్నాయి. ఇస్లాంలో చేతులు జోడించడానికి అనుమతి లేదు. అయినా, నేను చేతులు జోడించి, ప్రధానమంత్రిని అలా చేయొద్దని అభ్యర్థిస్తున్నా'' అని ముఫ్తీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘పరిస్థితులు సాఫీగానే ఉన్నాయి.. వదంతులు నమ్మొద్దు’
ముఫ్తీ సహా ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు ఆ తర్వాత రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మలిక్ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న గందరగోళానికి తెరదించి, వదంతుల వ్యాప్తిని అరికట్టాలని ఆయన్ను వారు కోరారు.
అయితే, రాష్ట్రంలో పరిస్థితులు సాఫీగానే ఉన్నాయని గవర్నర్ వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
''భద్రతా బలగాలకు సంబంధించిన ఆదేశాలను, వేరే అంశాలతో కలిపి చూస్తున్నారు. అందుకే ఇలాంటి వదంతులు పుడుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకులకు నేను అదే కోరా. ఇలా వేర్వేరు అంశాలను కలిపి చూడొద్దని వాళ్ల అనుచరులకు సూచించాలని చెప్పా. వదంతులను నమ్మొద్దు'' అని గవర్నర్ సత్యపాల్ మలిక్ వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
జమ్మూకశ్మీర్ ప్రభుత్వం శుక్రవారం భద్రతపరమైన ఆదేశాలు జారీ చేస్తూ కశ్మీర్లో మిలిటెంట్లు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని.. పర్యాటకులు, అమర్నాథ్ యాత్రికులు ఈ ప్రాంతం విడిచి వెళ్లిపోవాలని సూచించింది.
ఈ ఆదేశాలు జారీ అయిన అనంతరం వదంతుల వ్యాప్తి మరింత ఎక్కువైంది.

‘ఎందుకు ఖాళీ చేయిస్తున్నారు?’
జమ్మూకశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో భయబ్రాంతులను ఎందుకు సృష్టిస్తున్నారని ఆయన ట్విటర్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
''పహల్గామ్, గుల్మార్గ్ నుంచి ప్రజలను పంపించేందుకు ప్రభుత్వ బస్సులను వాడుతున్నారు. యాత్రకు ప్రమాదం పొంచి ఉంటే, గుల్మార్గ్ను ఎందుకు ఖాళీ చేయిస్తున్నారు?'' అని ఒమర్ ట్వీట్ చేశారు.

‘ఎక్కడా కర్ఫ్యూ విధించలేదు’
ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతోనే కేంద్ర హోంశాఖ భద్రతాపరమైన కొన్ని సూచనలు చేసిందని జమ్మూకశ్మీర్ డివిజనల్ కమిషనర్ బషీర్ అహ్మద్ ఖాన్ అన్నారు.
''ఎక్కడా కర్ఫ్యూ విధించాలని ఆదేశాలేవీ రాలేదు. రేపు పాఠశాలలు నడుస్తాయి. శాంతియుత వాతావారణం కొనసాగేందుకే హోంశాఖ ఆ సూచనలు చేసింది'' అని ఆయన అన్నారు.
మరోవైపు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15వరకు శ్రీనగర్కు వచ్చే, వెళ్లే విమానాల టికెట్ల రద్దు, రీషెడ్యూలింగ్పై రుసుములు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది.
అమర్నాథ్ యాత్రికులు క్షేమంగా తిరిగివచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని పఠాన్కోట్ జిల్లా అధికారులను పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ఆదేశించారు.
ఇవి కూడా చూడండి:
- అమర్నాథ్ యాత్ర: ఈ హిందూ తీర్థయాత్రకు ముస్లింలే వెన్నెముక
- 'దంగల్' అమ్మాయి జైరా వసీం సినిమా రంగాన్ని ఎందుకు వదిలేసింది...
- Zomato: 'తిండికి మతం లేదు'.. 'మరి హలాల్ మాటేంటీ?'
- అరుదైన హైదరాబాదీ నగిషీ కళకు కాలం చెల్లిపోయిందా...
- పోలవరం ప్రాజెక్టు స్పిల్వేలోకి నీళ్లు.. వైఫల్యమా, ఘనతా?
- యెమెన్ యుద్ధం: నడుస్తున్న చరిత్రలో రక్త కన్నీటి అధ్యాయం... ఈ పోరుతో ఏం ఒరిగింది
- పాకిస్తాన్లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
- చార్లెస్ డార్విన్కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








