హైతీ: ఇంటిపై దాడి చేసి దేశాధ్యక్షుడిని హత్య చేసిన సాయుధులు – Newsreel

హైతీ అధ్యక్షుడు

ఫొటో సోర్స్, Getty Images

హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మోస్ హత్యకు గురయ్యారని ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి జోసెఫ్ వెల్లడించారు.

దేశ రాజధానిలో ఉన్న అధ్యక్షుడి ఇంటిపై జరిగిన సాయుధ దాడిలో జొవెనెల్ చనిపోయారని తెలిపారు.

స్థానిక కాలమానం ప్రకారం ఒంటి గంటకు గుర్తుతెలియని కొందరు సాయుధులు అధ్యక్షుడి అధికారిక నివాసంలోకి చొరబడ్డారు.

ఈ దాడిలో అధ్యక్షుడి భార్య కూడా గాయపడినట్లు అనుమానిస్తున్నారు.

దేశంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తాత్కాలిక ప్రధానమంత్రి జోసెఫ్ చెప్పారు.

హైతీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హైతీలో ఈ ఏడాది ప్రారంభంలో నిరసనలు

2017 ఫిబ్రవరి నుంచి జొవెనెల్ మోస్ హైతీ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి.

ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

జొవెనెల్ పదవి కాలం 2021 ఫిబ్రవరిలోనే ముగిసిందని, వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని హైతీ విపక్షాలు డిమాండ్ చేశాయి.

అయితే, తన పదవి కాలం మరో ఏడాది ఉందంటూ ఆయన గద్దె దిగడానికి నిరాకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)