గర్భిణికి మధుమేహం వస్తే బిడ్డకు ఏమవుతుంది?

వీడియో క్యాప్షన్, తల్లీ బిడ్డలకు ప్రమాద ఘంటికలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?

గర్భం దాల్చిన తర్వాత వచ్చే మధుమేహం తల్లీ శిశువులకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని బ్రిటన్ లోని ఒక స్వచ్ఛంద ఆరోగ్య పరిశోధన సంస్థ వెల్లడించింది.

గర్భిణికి మధుమేహం వస్తే దాని వల్ల శిశువుల పరిమాణం బాగా పెరిగే అవకాశం ఉందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.

అంతేకాకుండా, తల్లి నుంచి బిడ్డకు టైప్-టూ మధుమేహం సంక్రమించే అవకాశాలు ఆరు రెట్లు అధికంగా ఉంటాయి.

ఊబకాయులు, దక్షిణ ఆసియా ప్రాంతానికి చెందిన మహిళలకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.

వారు ఇంకా ఏం చెబుతున్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)