జహంగీర్ నుంచి నిజాం రాజుల దగ్గరికి వచ్చిన 12 కేజీల భారీ బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?

వీడియో క్యాప్షన్, జహంగీర్ నుంచి నిజాం రాజుల దగ్గరికి వచ్చిన 12 కేజీల భారీ బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?

ఒకప్పుడు నిజాం రాజుల దగ్గర 12 కిలోల బరువైన బంగారు నాణెం ఉండేది. ఈ భారీ గోల్డ్ కాయిన్ ఇప్పుడు ఎక్కడ ఉందన్న ప్రశ్న ఆసక్తి రేపుతోంది.

కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ప్రాచీన నాణేల ప్రదర్శన జరిగింది. అక్కడ ఈ నాణెం ప్రతిరూపాన్ని ప్రదర్శించారు.

ఈ ప్రదర్శనలో చూసిన బంగారు నాణేల మీద ఆసక్తి పెంచుకున్న ప్రొఫెసర్ సల్మా ఫారూఖీ వీటి గురించి కొంత సమాచారం సేకరించారు. ఈ నాణెం ఇప్పుడు ఎక్కడ ఉందన్న అంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రొఫెసర్ సల్మా ఫారూఖీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో హెచ్‌.కె. షేర్వాని సెంటర్‌లో డక్కన్ స్టడీస్ విభాగంలో డైరెక్టర్‌గా ఉన్నారు.

''ఆయనకు పార్సీ భాష అంటే ఎక్కువ మక్కువ ఉండేది. అందుకే ఆ నాణేలపై కూడా పార్సీ భాష కనిపించేది. ఈ నాణేలు వాడుకకు కాకుండా, బహుమతులుగా ఇవ్వడానికి చేయించారు. అందులో భాగంగా తయారు చేసిన వాటిలోవే సుమారు 1,000 మొహర్ల బంగారపు నాణేలు. ఈ నాణెం బరువు 11 కిలోల 193 గ్రాములు'' అని ఈ బంగారు నాణెం గురించి వివరించారు ప్రొఫెసర్ సల్మా ఫారూఖీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)