పిల్లుల కోసం నెలకు రూ.1.5 లక్షలు ఖర్చు.. భార్య నగలు కూడా అమ్మేసిన గుజరాత్ వాసి

వీడియో క్యాప్షన్, పిల్లుల కోసం నెలకు రూ.1.5 లక్షలు ఖర్చు

హిందువుల్లో ఆవుల పట్ల భక్తి సర్వసాధారణం. కానీ, గుజరాత్లోని కచ్ లో ఓ వ్యక్తి తన జీవితాన్ని పిల్లులకు అంకితం చేశారు. ఉపేంద్ర గోస్వామి తన ఆదాయంలో ఎక్కువ భాగం 200 పిల్లుల పెంపకానికి ఖర్చు చేస్తున్నారు.

ఇందులో ఎక్కువ శాతం ఆయన కాపాడినవే. ఆయనకు సంబంధించినంత వరకూ ఈ వ్యవహారం అంతా పిల్లుల పెంపకానికే పరిమితం కాదు. ఆయన సోదరి జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకునే అంశం కూడా.

పిల్లులకు నివాసం కోసం ఉపేంద్ర తన ఆస్తినంతా ఖర్చు చేశారు.

‘‘ఈ క్యాట్ గార్డెన్ నిర్మాణం కోసం నా భార్య నగలు అమ్మేశాను. జీవితకాలంలో పొదుపు చేసిన సొమ్మంతా ఖర్చు చేసి భూమి కొన్నాను’’ అని ఆయన చెప్పారు.

పిల్లులు స్నానం చేస్తూ ఎంజాయ్ చేసేందుకు ఒక ఫౌంటెన్ ఏర్పాటు చేశాం. అవి సినిమా చూసేందుకు మినీ థియేటర్ కూడా ఉంది.

క్యాట్ హౌస్ నిర్వహణ కోసం వీరికి నెలకు దాదాపు లక్షా యాభై వేల రూపాయల దాకా ఖర్చవుతోంది.

ఇది ఆయన కథ…

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)