వైసీపీ మెజారిటీకి ప్రజాశాంతి పార్టీ గండికొట్టిందా? ఒకే పేరుతో నిలబెట్టిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లెన్ని?

జగన్, కేఏ పాల్

ఫొటో సోర్స్, FACEBOOK

ఆంధప్రదేశ్ ఎన్నికల్లో కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ చాలా చోట్ల తన అభ్యర్థులను బరిలోకి దింపింది. కొన్ని చోట్ల వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన వ్యక్థులను బరిలోకి దింపిందనే వార్తలు వచ్చాయి. దీనిపై వైసీపీ ప్రతినిధులు మార్చి 26న దిల్లీకి వచ్చి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు.

దాదాపు 35 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను పోలిన అభ్యర్థులను ప్రజాశాంతి పోటీలో నిలబెట్టిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ప్రజాశాంతి ఎన్నికల గుర్తు అయిన హెలికాప్టర్ కూడా తమ ఫ్యాన్ గుర్తును పోలి ఉందని, దీనిపైనా చర్యలు తీసుకోవాలని కోరింది.

అయితే, కేఏ పాల్ నిలబెట్టిన అభ్యర్థుల వల్ల వైసీపీకి నష్టం జరిగిందా..? ఏ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల మెజారిటీపై ప్రభావం పడింది? ఫలితాలు ఎలా ఉన్నాయి? అనేది కింది పట్టికలో చూడొచ్చు.

పై పట్టికను గమనిస్తే వైసీపీ మెజారిటీపై ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల ప్రభావం నామమాత్రంగా కూడా లేదని అర్థమవుతుంది. ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్ల డిపాజిట్లు సైతం కోల్పోయారు.

ప్రజాశాంతి ఎన్నికల గుర్తు అయిన హెలికాప్టర్ వల్ల కూడా తమకు నష్టం చేకూరుతుందని వైసీపీ భావించింది. కానీ, అలాంటిదేమీ జరగలేదని తెలుస్తోంది.

నోట్ : ఈ వివరాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి సేకరించినవి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)